“పుష్ప 2” లేటెస్ట్ రూమర్స్ పై క్లారిటీ చెప్పిన కీలక మెంబర్.!

తన సొంత స్టార్డం తో పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకున్న ఏకైక తెలుగు హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. కాగా తెలుగు నుంచి దర్శకుడు రాజమౌళి వల్ల పాన్ ఇండియా వైడ్ కొందరు హీరోలు ఇమేజ్ తెచ్చుకుంటే బన్నీ ఒక్కడే తన సొంత సినిమాలతో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న మాసివ్ పాన్ ఇండియా ప్రోడక్ట్ నే పుష్ప 2 కాగా దీనిని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల లేటెస్ట్ గా టెలివిజన్ న్యూస్ ఛానెల్స్ లోనే పలు షాకింగ్ రూమర్స్ అయితే వైరల్ గా మారాయి.

షూటింగ్స్ స్టార్ట్ అయ్యి చాలా కాలం కావడంతో సినిమా షూటింగ్ ఏకంగా 80 శాతం అయిపోయింది అని ప్రచారం చేసేస్తున్నారు. అయితే అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందో అల్లు అర్జున్ టీం కీలక మెంబర్ శరత్ చంద్ర నాయుడు రివీల్ చేసాడు. సినిమా షూటింగ్ అంత అయ్యింది అని ప్రచారం వార్తల్లో నిజం లేదు అని నో చెప్పేసాడు.

అలాగే ఇప్పటి వరకు అయితే షూటింగ్ ఇంకా 40 శాతంలోనే ఉంది అని కూడా కన్ఫర్మ్ చేసాడు. దీనితో పుష్ప 2 షూటింగ్ నత్త నడకన సాగుతుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరింతమంది స్టార్స్ కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.