తెరపై ఎంత యాక్టివ్గా, ఎంత మెచ్యుర్డ్గా ఉంటాడో తెర వెనుకా అంతే ఒదిగి ఉంటాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ది ప్రత్యేక శైలి. ఏదైనా సినిమా నచ్చితే వెంటనే పొడిగేస్తాడు. తన అభిమానులను ప్రతీ సందర్భంలో గుర్తు చేసుకుంటాడు. సదరన్ స్టార్గా బన్నీ క్రేజ్ మామూలు రేంజ్లో ఉండదు. ఇక బన్నీ స్వతాహాగా మంచి మనసు ఉండటం కావడంతో అభిమానులు కూడా అంతే ప్రేమను కనబరుస్తుంటారు. బన్నీ మంచి మనసుకు ఓ ఉదాహరణ.
ప్రతీ హీరోకు, ప్రతీ ప్రొడక్షన్ కంపెనీకి ఓ పీఆర్ఓ ఉంటాడు. అయితే వారిని కొందరు హీరోలు సొంత మనుషుల్లా చూసుకుంటారు. ఇంకొందరు సినిమా వరకే వ్యవహరిస్తుంటారు.అయితే మెగా, అల్లు కాంపౌండ్లో కొందరు పీఆర్ఓలు ఉన్నారు. అందులో ఎస్కేఎన్, ఏలూరు శీను వంటివారున్నారు. వీరంతా మెగా అభిమానులే. అయితే ఇందులో నిన్న (సెప్టెంబర్ 16) ఏలూరు శ్రీను పుట్టిన రోజు. ఈ సందర్బంగా బన్నీ సర్ ప్రైజ్ చేశాడట.
ఈ మేరకు ఏలూరు శ్రీను ట్విట్టర్లో ఎమోషనల్ అయ్యాడు. ‘నిన్న ఉదయం 8 గంటలకు ఓ ఫోన్ వచ్చింది హ్యాపీ బర్త్ డే శ్రీను.. అని చెప్పారు. అది నాకు ఆ రోజును ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. ఆ తరువాత ఆయన తన ఇంటికి ఆహ్వానించారు.. కేక్ కట్ చేయించారు.. ఆయన దయాగుణంలో బాస్ అని చెప్పడానికి నేను గర్వంగా ఫీలవుతాను.. దటీజ్ మై బాస్’ అంటూ అల్లు అర్జున్ చూపించిన ప్రేమకు ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ ట్వీట్ను చూసిన నెటిజన్స్ బన్నీ నిజంగానే మనసున్న మారాజు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.