ముంబైలో అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ తో మంతనాలు??

పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. మరి అల్లు అర్జున్ ఇప్పుడు హీరోగా దర్శకుడు సుకుమార్ తో భారీ సీక్వెల్ “పుష్ప 2” లో బిజీగా ఉండగా దీనిపై హైప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది.

కాగా ఈ సినిమా పక్కన పెడితే రానున్న రోజుల్లో అల్లు అర్జున్ ఎంపిక చేస్తున్న సినిమాలు ఓ రేంజ్ లోకి వెళ్లనున్నాయి అనేది మాత్రం స్పష్టం అవుతుంది. ఇప్పటికే దర్శకుడు సందీప్ వంగ తో ఓ సినిమా ఓకే చేసుకోగా నెక్స్ట్ తమిళ దర్శకులు ఇద్దరు తన లైన్ లో ఉన్నారు.

అంతే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా ఓ భారీ సినిమా ప్లాన్ చేయగా లేటెస్ట్ గా ఓ వార్త ఎగ్జైటింగ్ గా మారింది. అల్లు అర్జున్ ముంబై వెళ్లాడని అక్కడ ఓ దర్శకుణ్ణి కలిసి మంతనాలు జరిపాడు అని టాక్ వచ్చింది. అయితే ఆ దర్శకుడు మరెవరో కాదు లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ తో వర్క్ చేసి 1000 కోట్ల వసూళ్లు అందుకోబోతున్న యంగ్ దర్శకుడు అట్లీ అని అంటున్నారు.

కాగా వీరి సినిమా కోసమే ఇప్పుడు టాపిక్ నడుస్తుండగా ఈ కాంబో నిన్న మాట్లాడుకొని సినిమా ఓకే చేసుకున్నారని అంతే కాకుండా ఈ సినిమాని అయితే తమిళ ఇండస్ట్రీ నుంచి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనుంది అంటూ కూడా రూమర్స్ మొదలయ్యాయి. మరి మొత్తానికి అయితే అల్లు అర్జున్ మాత్రం తన సినిమాల విషయంలో ఇప్పుడు చాలా పక్కాగా ప్లానింగ్ లు చేసుకుంటున్నాడు అని చెప్పాలి.