‘అఖండ-2’ నిర్మాతగా అల్లు అరవింద్!?

‘అఖండ’ విజయం తర్వాత ఈ సినిమాకు బోయపాటి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘అఖండ-2’ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ సోషల్‌ మీ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే.. బోయపాటి త్వరలోనే బాలకృష్ణతో ‘అఖండ-2’ కు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ సినిమాకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల రాజకీయ ప్రచారానికి విరామం తీసుకోనున్నారు బాలకృష్ణ. ఇక ఎన్నికల అనంతరం బాలయ్య ‘అఖండ-2’ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్‌ మాస్‌ కమర్షియల్‌ మాస్‌ బ్లాక్‌బస్టర్స్‌ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత ఎస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌లు త్వరలో ఓ సినిమాకు చేతులు కలపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు ‘సరైనోడు’ సినిమా రాగా.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా అల్లు అర్జున్‌కు మాస్‌ ఇమేజ్‌ ను తెచ్చిపెట్టింది. ఇక 2016 తర్వాత అల్లు అరవింద్‌, బోయపాటి చేతులు కలుపుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మొదట అల్లు అర్జున్‌తో ఈ సినిమా ఉండబోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలకృష్ణ వచ్చి చేరాడు.