మంచి ప్లానే వేశాడే.. నాగార్జునను కలిసిన అఖిల్

Akhil Sarthak meets Nagarjuna

బిగ్ బాస్ కంటెస్టెంట్లు, హోస్ట్‌ల మధ్య ఓ మంచి రిలేషన్ ఉంటుంది. అయితే కంటెస్టెంట్లందరితోనూ అదే ర్యాపో హోస్ట్‌లకు ఉంటుందా? అంటే చెప్పలేం. కానీ నాగార్జున మాత్రం అందరితో ఒకేలా ఉంటాడని అందరూ అంటుంంటారు. బిగ్ బాస్ షో ముగిశాక కూడా కంటెస్టెంట్లను తన మనుషుల్లానే చూస్తాడట. అందుకే వారు ఎప్పుడు కలవాలని అడిగినా కూడా వీలు చూసుకుని కబురు పంపుతాడట.

Akhil Sarthak meets Nagarjuna
Akhil Sarthak meets Nagarjuna

అందుకే ఆ మధ్య సోహెల్ కలుస్తానంటే తన విలువైన సమయాన్ని నాగార్జున కేటాయించాడు. బిగ్ బాస్ ముగిసి నెల రోజులు అయినందుకు నాగార్జునను సోహెల్ కలిశాడు. అయితే తాజాగా అఖిల్ కూడా నాగార్జునను కలిశాడు. అయితే దీని వెనుక మంచి ప్లానే ఉన్నట్టు కనిపిస్తోంది. అఖిల్ నటించిన మొదటి ప్రైవేట్ ఆల్బమ్‌ తాజాగా రిలీజ్ అయింది. అదే సమయంలోనాగార్జును అఖిల్ కలిశాడు.

నాగార్జున చేతుల మీదుగానే తన ఆల్బమ్‌ను అఖిల్ రిలీజ్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నాగార్జునను కలవడం, విలువైన సమయాన్ని ఇవ్వడంతో అఖిల్ సంబరపడిపోయాడు. ఒకే ఒక్క కింగ్ నాగార్జునను కలవడం ఎంతో సంతోషంగా ఉంది.. మీ విలువైన సమయాన్ని ఇలా ఇచ్చినందుకు.. మళ్లీ నాటి మెమోరీస్‌ను గుర్తు చేసినందుకు, అభినందించినందుకు థ్యాంక్స్ సర్ అంటూ చెప్పుకొచ్చాడు.