‘పుష్ప2’ విడుదలతో ఆజయ్‌ సినిమా వాయిదా!

అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ’పుష్ప 2’ విడుదల తేదీని ఆగస్టు 15 గా అధికారికంగా ప్రకటించి, పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అయితే ముందుగా మార్చ్‌ 22న విడుదల అనుకున్నట్టు సమాచారం. కానీ ఆ సమయానికి సినిమా పూర్తవకపోవచ్చు అని, అందువల్ల హడావిడిగా విడుదల చెయ్యడం ఎందుకని వచ్చే సంవత్సరం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే అల్లు అర్జున్‌, సుకుమార్‌ ఈ తేదీ ప్రకటించగానే బాలీవుడ్‌ లో అజయ్‌ దేవగన్‌ కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అజయ్‌ దేవగన్‌, రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌ లో వస్తున్న ’సింగం అగైన్‌’ సినిమా ఆగస్టు 15న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ’పుష్ప 2’ అదే తేదీకి ప్రకటించటంతో, అజయ్‌ దేవగన్‌ సినిమా ఇప్పుడు ఇంకో కొత్త తేదీకి వాయిదా వేసుకుంటున్నారు. అజయ్‌ దేవగన్‌, రోహిత్‌ శెట్టి సినిమాకి స్పెషల్‌ గా ఎక్కువ సెలవు రోజులుండే వీకెండ్‌ అవసరం లేదని, వాళ్ళది ఒక బ్రాండ్‌ అని, ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చు అని, కానీ ’పుష్ప 2’ లాంటి సినిమాకి సెలవు రోజులు అవసరమని, అందుకే వాళ్ళ వ్యాపారం పోకుండా, అజయ్‌ దేవగన్‌ తన సినిమా ’సింగం అగైన్‌’ వాయిదా వేసుకోనున్నట్టుగా బాలీవుడ్‌ విూడియా కథనాలు రాసింది.