“విక్రమ్” చూసాక కమల్ కి రజినీ కాల్..మూడే మూడు ముక్కలు చెప్పారట.!

 

లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర మళ్ళీ ఓ సినిమా కోసం ఓ రేంజ్ లో ఆడియెన్స్ మాట్లాడుకుంటున్న బిగ్గెస్ట్ ఆక్షన్ ట్రీట్ చిత్రం “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ రాజ్ మరియు ఉలగ నాయగన్ కమల్ హాసన్ ల కాంబో నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు భారీ వసూళ్ల మార్క్ దిశగా కొనసాగుతుంది.

 

అయితే మరో పక్క సినిమా చూసిన ఇతర ప్రముఖ నటులు ఓ రేంజ్ లో తమ రెస్పాన్స్ ని తెలియజేస్తుండగా లేటెస్ట్ గా అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ విక్రమ్ సినిమాని చూశారట. మరి చూసిన వెంటనే డైరెక్ట్ గా కమల్ కి కాల్ చేసి తన రెస్పాన్స్ ని ఓ రేంజ్ లో తెలిపారట. మూడే మూడు ముక్కలు చెప్పారట.

 

“సూపర్ సూపర్ సూపర్” అంటూ ఈ సినిమాకి తన కమల్ తో కాల్ లో తెలియజేశారట. అలాగే తర్వాత దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ మరియు నిర్మాతలకు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్టుగా తమిళ సినీ మీడియా వారు తెలియజేసారు. ఇక ఈ సినిమాలో కమల్ తో పాటుగా సూర్య, ఫహద్ ఫాజిల్ అలాగే విజయ్ సేతుపతి లు సాలీడ్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.