ఆది చిత్రం..’కృష్ణ ఫ్రమ్‌ బృందావనం’!

టాలీవుడ్‌ యువకథానాయకుడు ఆది సాయికుమార్‌ కొత్త చిత్రం మొదలుపెట్టాడు. తనకు చుట్టాలబ్బాయి వంటి మంచి హిట్‌ సినిమాను అందించిన దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరితో మరో సినిమా చేయబోతున్నాడు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. దిగంగనా సూర్యవంశీ కథనాయికగా నటిస్తుంది. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్‌ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది ఈ ప్రాజెక్ట్‌. ఇక ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

మురళీధర్‌ గౌడ్‌, 30 ఇయర్స్‌ పృధ్వీ, రఘు బాబు, అవినాష్‌, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్‌, గోవర్ధన్‌, మాస్టర్‌ రిత్విక్‌, వెంకట్‌ నారాయణ, గురు రాజ్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా.. రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఇక ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.