తిరుమలలో సందడి చేసిన నటి జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దివంగత నటి శ్రీదేవి. అయితే ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా అన్ని భాషలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇలా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న జాన్వీ కపూర్ తాజాగా శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.ఇలా స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుని ఈమె స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు.స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల సందడి చేసిన ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ నిత్యం పొట్టి దుస్తులు ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తుంటారు.

ఇలా నిత్యం హాట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ తిరుమల ఆలయానికి మాత్రం సాంప్రదాయబద్ధంగా అచ్చ తెలుగు అమ్మాయిల లంగా వోని ధరించి ఎంతో అందంగా ముస్తాబయి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.ఇలా ఆలయం బయట ఈమె కెమెరాలు కంట పడటంతో పెద్ద ఎత్తున ఈమె ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సాంప్రదాయ దుస్తులలో చూడటానికి చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.