‘పెళ్లి సందడి’తో ‘లగ్గం’ సినిమా!

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వేణుగోపాల్‌ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్‌ చెప్పాలఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనాక్‌, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేందప్రసాద్‌, రోహిణి, ఎల్‌.బి శ్రీరామ్‌, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు.

మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లినీ కన్నుల విందుగా చూపించ బోతున్నామని, ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటారని, కళ్ళ ముందు కొత్త ఎక్స్పీరియన్స్‌ ను ఉంచే ఈ సినిమా.. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రం అవుతుందని…’ అని దర్శకుడు రమేష్‌ చెప్పాల, నిర్మాత వేణుగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నటుడు డాక్టర్‌ రాజేందప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్‌ తో చాలా చిత్రాలు వచ్చాయని, అందుకు భిన్నంగా ఈ ‘లగ్గం’ సినిమా ఉండ బోతోందని… తెలంగాణతనం ఉట్టిపడే విధంగా దర్శకుడు రమేష్‌ ఈ సినిమాను తేరకెక్కిస్తున్నాడని’ అన్నారు. అన్ని రకాల హంగులతో దర్శకుడు ‘లగ్గం’ యూనివర్స్‌ ను క్రియేట్‌ చేయబోతున్నాడని నటి రోహిణి తెలిపింది.