అభినవ్‌ గోమఠం..మై డియర్‌ దొంగ!

‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్‌ అభినవ్‌ గోమఠం హీరోగా నటిస్తోన్న లేటెస్ట్‌ మూవీ ‘మై డియర్‌ దొంగ’ సర్వజ్ఞ కుమార్‌ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్‌ కాబోతోంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రాబోతున్న ‘మై డియర్‌ దొంగ’లో అభినవ్‌ గోమఠంకి జోడీగా శాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఇంట్లోకి వచ్చిన దొంగ దొంగతనం చేస్తూ ఓ అమ్మాయికి దొరికితే వాడి కష్టాలు చెప్పి ఆ అమ్మాయికి ఫ్రెండ్‌గా ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సరికొత్త కాన్సెప్ట్‌తో..ఫన్నీగా ఉండబోతున్నట్టు చూపించారు.’మై డియర్‌ దొంగ’ సినిమా మొత్తం అభినవ్‌ కామెడితో కడుపుబ్బా నవ్వించబోతున్నాడని ట్రైలర్‌ ను చూస్తే అర్ధమవుతోంది.అమ్మ బాబోయ్‌..దొంగోడు!విూ నవ్వులు దోచేందుకు ‘ట్రైలర్‌’ తో వచ్చాడు అనే ట్యాగ్‌తో రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇప్పటివరకు ప్రేక్షకులు అడవి దొంగ విన్నారు.టక్కరి దొంగ విన్నారు.

జేబు దొంగ విన్నారు.కానీ మై డియర్‌ దొంగ ఎవరో తెలియాలంటే. ఆహా ఓటీటీలో రిలీజ్‌ అయిన .మై డియర్‌ దొంగ సినిమా చూడాల్సిందే అంటూ ట్యాగ్‌ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులు అభినవ్‌ గోమఠం చేసే సరదా సన్నివేశాలు ఎలా ఉండబోతు న్నాయో అని ఆసక్తిగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను మహేశ్వర్‌ రెడ్డి నిర్మించాడు.అజయ్‌ అరసాడా మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రాన్ని..డైరెక్ట్‌గా ఆహా ఒరిజినల్‌ ‘మై డియర్‌ దొంగ’ను రూపొందించినట్లు సమాచారం.