ఆ డైరెక్టర్ పై  పూజాహెగ్డేకు ఎందుకంత కసి?!

Pooja Hegde

పూజాహెగ్డే చీటికీ మాటికీ అతడిపై కసిని పెంచుకుంటుందట. అతడంటే  ఆమెకు ఎందుకంత కసి?! అని టాలీవుడ్ గుప్పుమంటోంది.  ఇంతకీ అతడెవరో అనేగా మీ డౌట్? అదే పూజాహెగ్డే ని అడిగితే.. ‘నాకూ తెలియదు అతడంటే  నాకు ఎందుకంత కసో.. మీకు తెలిస్తే చెప్పండి’ అంటూ జారుకుంటోందిట. ఆ మధ్య ఓ మంచి సినిమా అవకాశం  పూజాహెగ్డే నుంచి వేరే నటికీ వెళ్ళడానికి కారణం అతడేనట. అందుకే ఆ డైరెక్టర్ పై తెగ విరుచుకు పడుతోందిట.

Pooja Hegde
Pooja Hegde

ఇదిలా ఉండగా,  ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా  చిత్రం  1970ల కథాంశంతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.  తన పాత్ర విషయానికొస్తే.. ఇందులో ఆమెది పురాణాల్లో చూపించే రాధ పాత్ర కాదు. అయితే ఇందులో పాత్రలకు చారిత్రాత్మకమైన ప్రేమికులే స్ఫూర్తి.ఆమెలోని  ప్రతిభను బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం దొరికింది.

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ 150 కోట్ల పీరియాడిక్‌ ప్రేమకథా చిత్రాన్ని యు.వి క్రియేషన్,  గోపీకృష్ణా మూవీస్‌, టి సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్, పూజా కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు.  భాగ్యశ్రీ, కృష్ణంరాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

అలాగే రణవీర్ సింగ్ ‌మరోసారి క్రేజీ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ‘సింబా’ ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కలయికలో కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సర్కస్‌’ సినిమా రూపొందబోతుంది. ఈ చిత్రం షేక్‌స్పియర్ నవల ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఆధారంగా తెరకెక్కనుంది. ‘సర్కస్’‌ లో ర‌ణ్‌వీర్‌కు జంట‌గా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క‌ధా‌నాయిక‌లుగా న‌టిస్తున్నారు.