పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని భారీ సంఖ్యలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలతో పాటు నన్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

www.cdn.digialm.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెల 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 37 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఉద్యోగ ఖాళీలకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతర అర్హతలు ఉండాలి.

కొన్ని ఉద్యోగ ఖాళీలకు బీటెక్ అర్హత కచ్చితంగా ఉండాలి. సంబంధిత బ్రాంచ్ లో బీటెక్ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కామర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టం 1,77,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. www.iwai.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.