పది పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు.. రూ.20,000 వేతనంతో భారీగా ఉద్యోగాలు?

ఏపీలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. అర్హత ఉన్నా సరైన ఉద్యోగం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వాళ్లకు నంది సోప్స్ ఇండస్ట్రీ అదిరిపోయే తీపికబురు అందించింది. మార్కెటింగ్ చేసేవాళ్లకు ప్రతిభ ఆధారంగా వేతనం ఇవ్వడానికి ఈ సంస్థ సిద్ధమైంది. పది, ఇంటర్, డిగ్రీ పాసై మార్కెటింగ్ రంగంలో ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం ప్రయత్నించవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హత, అనుభవం ఆధారంగా వేతనంలో మార్పులు ఉంటాయి. మార్కెటింగ్ స్టాఫ్, ఆఫీస్ వర్కింగ్ స్టాఫ్ ను ఈ సంస్థ నియమించుకోనుంది. బైరెడ్డిపల్లి మండలంలో ఉన్న నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉండి ఇప్పటికే ఇతర సోప్స్ ను విక్రయించడంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ వ్యాపారంపై దృష్టిపెడితే మంచిది.

బిజినెస్ లో ఊహించని స్థాయిలో సత్తా చాటితే వేతనం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ ఆఫర్ కోసం దరఖాస్తు చేసుకుని జాబ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకుంటే దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఈ రంగంలో సక్సెస్ అయ్యి లక్షలు సంపాదిస్తున్న వాళ్లు సైతం ఉన్నారు.

అయితే మార్కెటింగ్ రంగంలో ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపికతో వర్క్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. గూగుల్ ద్వారా ఈ కంపెనీకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.