ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రాజమహేంద్రవరంలో భారీగా టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, తూర్పు గోదావరి నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వయోపరిమితి, దరఖాస్తు రుసుము, అర్హత,ఎంపిక ప్రక్రియ వివరాలను తెలుసుకుని ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

మొత్తం 12 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్‌-3 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఎస్సీ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్‌ సివిల్ సప్లైస్‌ మేనేజర్‌ ఆఫీస్‌, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.

2023 సంవత్సరం డిసెంబర్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తున్నాయి.

టెక్నికల్ అసిస్టెంట్స్ జాబ్స్ పై ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది.