పాత పెన్షన్‌ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. పూర్తి వివరాలు..!

ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగస్తులు పొందే పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక ప్రకటన చేసింది. పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలనుకునే ఉద్యోగస్తులకు ఇది శుభవార్త. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు పాత పెన్షన్ ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఎవరెవరు ఈ OPS ప్రయోజనం పొందుతారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కేంద్రం ప్రభుత్వ ప్రకటన ప్రకారం డిసెంబర్ 22, 2003కి ముందు నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ డిసెంబర్ 22, 2003 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనం వర్తించదు. పాత పెన్షన్ స్కీంకు అర్హులైన ఉద్యోగస్తులు ఆగస్టు 31, 2023 వరకు ఈ పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు 31 వరకు పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకోని వారు కొత్త పెన్షన్ స్కీమ్‌లో చేర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఒక సారి పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకున్న తర్వాత మారడం సాద్యం కాదు. పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకోవడం అనేది ఉద్యోగికి అందుబాటులో ఉన్న చివరి అవకాశం. ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకున్న తర్వాత కొత్త పెన్షన్ పథకానికి మారలేరు. అందువల్ల పాత పెన్షన్ స్కీం ప్రయోజనాలను పొందాలనుకున్న వారు మాత్రమే ఇందులో చేరవచ్చు.
ఇక్కడ పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను పరిశీలిస్తే, చివరిగా అందుకున్న జీతం ఆధారంగా పెన్షన్ నిర్ణయించబడుతుంది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణం రేటు పెరిగే కొద్దీ DA కూడా పెరుగుతుంది. ప్రభుత్వం కొత్త పే కమీషన్‌ను అమలు చేస్తుంది. కానీ పెన్షన్‌ను పెంచింది.