ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారా… మీరు ఈ ప్రమాదంలో పడినట్లే?

ఈ స్మార్ట్ యుగంలో మనీ ట్రాన్సాక్షన్ మొదలుకొని టార్చ్ లైట్ ను ఉపయోగించడం వరకు అన్ని ముఖ్యమైన పనులకు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే. సెల్ ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం అరచేయిలో ఉన్నట్టే . అయితే స్మార్ట్ ఫోన్ వాడకంలో ఎంత మంచి దాగి ఉందో చెడు ప్రభావం కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగించేవారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కంటి సమస్యలు తలెత్తడంతో పాటుమానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది.

స్మార్ట్ ఫోన్ అవసరం మేరకు ఉపయోగిస్తే ఎటువంటి సమస్య లేదు. కొందరు ఉదయం నిద్ర లేచినప్పటి అర్ధరాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ అంటిపెట్టుకొని అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. ముఖ్యంగా కొందరిలో ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్ వినియోగించే అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే ప్రమాదకర నీలి కాంతి కిరణాలు మరియు రేడియేషన్ సున్నితమైన రెటీనా పనితీరుపై ప్రభావం చూపి కంటి చూపు మందగించడంతోపాటు కళ్ళు ఎర్రబడడం, కంటి కింద చారలు, కంటి వాపు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే కంటి సమస్యలతో పాటు మెదడు పనితీరు మందగించి ఏకాగ్రత లోపించి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో కూడా నిద్రలేమి సమస్యతో పాటు అనేక కంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి సమస్య వల్ల ఒత్తిడి పెరిగి ఉబకాయం , రక్తపోటు, అల్జీమర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తే వీటి నుంచి వెలువడే రేడియేషన్ ముఖ్యంగా యువకుల్లో సెక్స్ సామర్థ్యం లోపించి సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి.