అల్లు శిరీష్ పై చెన్నై మీడియా చెత్త ప్రచారం

గత రెండు రోజులుగా చెన్నై తమిళ మీడియాలో అల్లు శిరీష్ గురించిన ఓ ప్రచారం చేస్తోంది. అది చూసిన ఆయన అభిమానులు కోప్పడుతున్నారు. అదేమిటంటే…సూర్య తాజా చిత్రం బందోబస్త్ నుంచి శిరీష్ ని తొలిగించి ఆర్యను పెట్టుకున్నారు. మొదట అల్లు శిరీష్ ను అనుకున్నా ఆ తర్వాత రషెష్ చూసి ఆయన నటన నచ్చక తొలిగించారని. అందులో నిజం లేదంటున్నారు శిరీష్ సన్నిహితులు.

వాళ్లు అనేది ఏమిటంటే….బందోబస్తు సినిమా షూటింగ్ కు ముందు అల్లు శిరీష్ ను సంప్రదించిన మాట వాస్తవమే కానీ అదే సమయంలో ఎబిసిడి చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసారు శిరీష్ . దాంతో సూర్య మూవీకి నో చెప్పారట. అలాగే ఆర్య పాత్ర చాలా రగ్డ్ గా ఉంటుందని డైరక్టర్ చెప్పటంతో తనకు సెట్ కాదు అని శిరీష్ ఫీలయ్యారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాప్పన్(తమిళ వెర్షన్ టైటిల్ )కు నో చెప్పాడట శిరీష్. కానీ చెన్నై మీడియాలో దీని మార్చి ఇలా ప్రచారం చేస్తోందిట.

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బందోబస్త్. ఈ సినిమా టీజర్ రిలీజైంది. సూర్యతో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించిన మోహన్ లాల్, ఆర్య, సాయేషా క్యారెక్టర్లను పరిచయం చేస్తూ ఆ టీజర్ రెడీ అయ్యింది. యాక్షన్ ఎలిమెంట్స్ తో రిచ్ గా తెరకెక్కిన బందోబస్త్ టీజర్ కు మంచి హైపే వచ్చింది.