స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేస్తున్న శేఖర్ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయటం చాలా మంది అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ లో గుర్తింపు వస్తుంది. మినిమం సెన్సిబులిటీస్ తో సినిమా చేస్తారు. రీసెంట్ గా వరుణ్ తేజ సైతం సరైన హిట్ ఒకటి పడక కెరీర్ లో కదిలిక లేని సమయంలో శేఖల్ కమ్ముల చేతిలో పెట్టారు. దాంతో జనం ఫిధా అయ్యే సినిమా తీసి హిట్ కొట్టాడు. అక్కడ నుంచి వరుణ్ తేజ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్దితి లేదు. కెరీర్ పరుగులు పెడుతోంది. ఈ నేపధ్యంలో మరో స్టార్ హీరో కుమారుడుతో శేఖర్ కమ్ముల సినిమా చేయటానికి డిసైడ్ అయ్యినట్లు సమాచారం. అతను మరెవరో కాదు… చియాన్ విక్ర‌మ్ కుమారుడు ధృవ.

తమిళ స్టార్ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాను తమిళ్‌లో ధృవ్‌ హీరోగా తెరకెక్కిస్తున్నారు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ధృవ్‌ ఓ స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

విక్రమ్‌కు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే తన వారసుడ్ని రెండు భాషల్లో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తమిళ్‌లో బోల్డ్‌ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ధృవ్‌, తెలుగులో అందుకు భిన్నంగా ఓ క్లాస్‌ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో ధృవ్‌ టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డ్యాన్స్‌ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.