శర్వాకు ఇంకో దెబ్బ, టైటిల్ వేరొకరికి వెళ్లిపోయింది

హను రాఘవ పూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి హీరో, హీరోయిన్స్ గా నటించిన చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రం ఈ నెల 21 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాపై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో శర్వానంద్ కు ఊహించని పరిణామం అయ్యింది. దానినుంచి కోలుకోక ముందే శర్వాకు మరో దెబ్బ పడింది. అతను ఎంతో నచ్చి , ఆశలు పెట్టుకన్న టైటిల్ వేరొకరి సొత్తైంది.

వివరాల్లోకి వెళితే… శ‌ర్వానంద్, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ యాక్ష‌న్‌ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో శ‌ర్వానంద్ డాన్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. యుక్త వ‌య‌స్కుడైన డాన్, ఏజ్ వ‌చ్చిన త‌ర్వాత డాన్ ఇలా రెండు ర‌కాల గెట‌ప్‌ల‌తో కనపడనున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. చిత్రం క‌థాంశానికి త‌గ్గ‌ట్టుగానే `ద‌ళ‌ప‌తి` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసుకున్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

కానీ ఇదే టైటిల్‌ని వేరొక‌రు ఫిలింఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తాయ‌ని సమాచారం‌. దాంతో ఇప్పుడా ఆ టైటిల్ శ‌ర్వా సినిమాకు లేనట్లే. దాంతో `నాయ‌కుడు` అనే వేరొక టైటిల్ ప‌రిశీలిస్తున్నారని తెలుస్తోంది. జ‌న‌వ‌రి 1 లేదా డిసెంబ‌ర్‌ 31 రాత్రి కి ఈ టైటిల్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌. మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా రిలీజ‌వుతుంది.