ఆమెపై రాజమౌళి కన్ను, రేటు ఎక్కువని ఆలోచన

‘బాహుబలి’ తర్వాత కొంత గ్యాంప్ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు రెండో షెడ్యూల్‌ చిత్రీకరణతో బిజీగా ఉంది. కానీ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్స్ ఎవరనేది ఇంకా బయటకు రాలేదు.

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్స్ గా చలామణీలో ఉన్నవారిలో చాలా వరకు ఇంతకు ముందే తారక్‌, చరణ్‌ సరసన జత కట్టినవారే. అందువల్ల రాజమోళి వీరిద్దరికీ జతగా కొత్త హీరోయిన్స్ ని దిగుమతి చెయ్యనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఓ వైపు వేగంగా షూటింగ్ జరుగుతున్నా హీరోయిన్స్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్.

కాగా తాజాగా హీరోయిన్స్‌కి సంబంధించిన ఓ న్యూస్ తెగ షికారు చేస్తోంది. చిత్రంలో ఒక హీరోయిన్‌గా బాలీవుడ్ భామ పరిణితి చోప్రాను తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారట రాజమౌళి. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

అయితే ఈ సినిమాలో నటించేందుకు పరిణితి ఓకే చెప్పిందట కానీ భారీ రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. ఈ విషయమై ఎలాంటి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.