లాస్ట్ మినిట్ ట్విస్ట్ : ‘ఎన్టీఆర్’ బయోపిక్ కు సెన్సార్ ప్లాబ్లం

నందమూరి అభిమానులు మాత్రమే కాదు..సినిమా ప్రియులందరి దృష్టి ఇప్పుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ పైనే వుంది. ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంభందించిన అన్ని పూర్తైపోయాయి. ప్రమోషన్ కూడా ఓ రేంజిలో చేస్తున్నారు. బిజినెస్ కూడా పూర్తి చేసుకుని నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. అయితే లాస్ట్ మినిట్ లో సెన్సార్ దగ్గర సమస్యని ఫేస్ చేస్తోందని సమాచారం.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..క్రితం వారమే సెన్సార్ కోసం నిర్మాతలు సెన్సార్ బోర్డ్ ని ఎప్రోచ్ అయ్యారు. అయితే ఇప్పటిదాకా సెన్సార్ పూర్తి కాలేదు. సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ..రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు కానూ…ఈ సినిమాలో చూపించిన వ్యక్తుల ముఖ్యంగా నెగిటివ్ గా చూపించిన వారి వద్ద నుంచి NOC సర్టిఫికేట్ తెమ్మన్నారు.

NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు , లక్ష్మీ పార్వతి ల నుంచి ఈ సర్టిఫికేట్ తేవాల్సి ఉంది. క్రిష్, ఆయన టీమ్ ఆ సర్టిఫికేట్స్ సంపాదించే పనిలో ఉన్నట్లు సమాచారం. లక్ష్మీ పార్వతి కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే బాలకృష్ణ సీన్ లోకి వస్తారంటున్నారు.

విద్య బాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో 66 గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం.