ఎన్టీఆర్ ,చరణ్ ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజేసి…

తమ సినిమా పబ్లిసిటీ బాగా జరిగి నాలుగు రూపాయలు వస్తాయంటే ఎలాంటి సీన్ అయినా తమ సినిమాలో పెడుతున్నారు. ఎలాంటి వివాదాస్పదమైన డైలాగుని అయినా సినిమా ఇరికించేస్తున్నారు. మీడియా కూడా అలాంటి వార్తల కోసమే కాసుకుని ఉంటుంది. ఇదిగో ఇప్పుడు హీరో,హీరోయిన్ టైటిల్ తో రూపొందుతున్న ఓ కొత్త చిత్రం అటువంటి సన్నివేశమే క్రియేట్ చేయబోయింది. నవీన్ చంద్ర హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ రీసెంట్ గానే రిలీజైంది.

ఈ ట్రైలర్ లో ..భాగంగా మా ఎన్టీఆర్ సినిమానే పైరసీ చేస్తావా అంటూ హీరో చొక్కా పట్టుకుంటారు ఫ్యాన్స్. వచ్చేవారం రామ్ చరణ్ సినిమా వస్తోంది. ఇంతకంటే ఎక్కువ పైరసీ చేస్తా అంటాడు హీరో. అంతే, వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అతడ్ని మెచ్చుకుంటారు. దగ్గరుండి అతడికి సిగరెట్ వెలిగించి మరీ తమవాడిని చేసుకుంటారు. ఈ వివాదాస్పదమైన సీన్ పై హీరో నవీన్ చంద్ర స్పందించాడు. సమర్దించుకుంటున్నాడు. ఎన్టీఆర్, చరణ్ అభిమానుల్లో అలాంటివాళ్లు ఉన్నారంటున్నాడు ఈ హీరో.

నవీన్ చంద్ర మాట్లాడుతూ…”ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టడం మా ఉద్దేశం కాదు. అలాంటి వాళ్లు కూడా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం. ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ప్రస్తుతం అభిమానుల మధ్య జరుగుతున్నదే చూపించాం. అందులో తప్పేముంది.” అంటున్నారు.

అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తారనే విషయం మా యూనిట్ కు తెలియదని, ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టు సెట్ అవ్వడానికి ముందే మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని అంటున్నాడు నవీన్. టీజర్ లో ఆ డైలాగ్ పెట్టడానికి కారణం యూట్యూబ్ కారణం అంటున్నాడు.

నవీన్ చంద్ర కంటిన్యూ చేస్తూ..”అలాంటి ఫ్యాన్స్ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఒక హీరో ట్రయిలర్ రిలీజైతే ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ వచ్చి తిడుతున్నారు. కామెంట్స్ చూస్తే మీకే అర్థమౌతుంది. ఫ్యాన్స్ ఎందుకిలా రియాక్ట్ అవుతున్నారనే ఆలోచన నుంచే ఆ సీన్ పుట్టింది.” అన్నారు.

మొత్తానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ నిప్పులో తమ సినిమా వెలుగు చూసుకునే ప్రయత్నం ఇది అంటున్నారు. ఏది ఎంతవరకూ నిజమో చూడాలి. చూస్తూంటే అందరూ రామ్ గోపాల్ వర్మే సినిమా పరిశ్రమలో కనపడుతున్నారు.