ఎలర్టైన నాగ్…డైరక్టర్ కు వార్నింగ్

ఎలర్టైన నాగ్…డైరక్టర్ కు వార్నింగ్

హీరోలకు ఉన్న ఇమేజ్ కు ఏ మాత్రం భిన్నంగా సినిమాలు ఉన్నా ఫ్యాన్స్ కు నచ్చదు. వాళ్లు తమ నిరసన వ్యక్తం చేస్తారు. ట్రోల్ చేస్తారు. ఇప్పుడు నాగార్జున విషయంలో అదే జరుగుతోంది. మన్మధుడు 2 చిత్రం ట్రైలర్ విడుదల కాగానే అభిమానులు కొన్ని డైలాగులు, షాట్స్ చీప్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేసారు. వీరాభిమానులు కొందరు నాగ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే జనం లైట్ తీసుకుని నవ్వుకుంటారనుకున్న సీన్స్ రివర్స్ అయ్యేసరికి నాగ్ సైతం కంగారుపడ్డారట. వెంటనే ఎలర్టైన తన డైరక్టర్ ని పిలిచి ఇలాంటివి నెక్ట్స్ చేసే ప్రమోషన్ లోనూ, సినిమాలోనూ ఉండటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

నాగార్జున, దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్ రీసెంట్ గా విడుద‌ల చేశారు. ఇందులో పెళ్ళికాని నడి వ‌య‌స్కుడిగా నాగ్ న‌ట‌న ఫ్యాన్స్ ని నవ్వుల్లో ముంచెత్తింది.

రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌9న విడుద‌ల చేయ‌నున్నారు.