గూడార్దాలు వెతకద్దంటూ మహేష్ మీడియాకు కౌంటర్

Upendra Rejects Mahesh Babu offer

స్టార్ హీరోలు ఏమన్నా నోరు జారితే దాన్ని రచ్చ రచ్చ చేసి పండగ చేసుకుందామని ఎదురుచూస్తూంటుంది మీడియా. ఇప్పుడు అదే పరిస్దితి మహేష్ కు ఎదురైంది. రీసెంట్ గా జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ పంక్షన్ లో మహేష్ బాబు…వంశీ పైడిపల్లిని పొగిడాడు. అయితే వంశీని పొడిగింది కేవలం సుకుమార్ కు సెటైర్ వెయ్యటానికే అంటూ మీడియా వాళ్లు కథలు అల్లేసారు.

ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ… తన కోసం వంశీ మూడేళ్లు నిరీక్షించాడని, వేరే డైరక్టర్ ఎవరన్నా అయితే తన కోసం ఆగకుండా వేరే హీరోని వెతుక్కునేవాడంటూ అన్నారు. దాన్ని పట్టుకుని మీడియా ఖచ్చితంగా ఇది సుకుమార్ ని ఉద్దేశించి మహేష్ అన్నమాట అనేసారు. అక్కడితో ఆగకుండా రీసెంట్ గా మీడియాకు ఇంటర్వూలు ఇస్తూంటే అక్కడ ఈ విషయాన్ని డైరక్ట్ గా మహేష్ ని అడిగేసారు. అయితే మహేష్ తెలివి తక్కువ వాడా…వెంటనే తన దైన శైలిలో తెలివైన సమాధానం చెప్పాడు.

కేవలం తను వంశీ పైడిపల్లని తాను పొగిడాను కానీ ..సుకుమార్ ని ఏం అనలేదని, ఆ విషయంలో మీడియా గూడార్దాలు వెతకొద్దని , సుకుమార్ తనకి నేనిక్కొడనే లాంటి మంచి హిట్ చిత్రం ఇచ్చాడని అన్నారు. ఇక సుకుమార్ సినిమా ప్రక్కన పెట్టడానికి కారణం చెప్తూ… మహర్షి తరువాత ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నాను కానీ సుకుమార్ ఇంటెన్స్ తో కూడిన సీరియస్ స్టోరీ ని చెప్పాడు దాంతో సుకుమార్ ను కాదని అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను దానికి సుకుమార్ కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా మళ్ళీ సుకుమార్ తో సినిమాలు చేస్తానని మహేష్ అన్నారు.

అలాగే ఎస్ ఎస్ రాజమౌళి తో సినిమా చేస్తానని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఈప్రాజెక్టు గురించి ప్రకటన వస్తుందని తెలిపారు.