బోయ‌పాటి ఇపుడు ఏం చేస్తున్నారో తెలుసా?

 
(మోహన్)
 
టాలీవుడ్‌లో ఒక్కో సంద‌ర్భంలో ఒక్కొక్క‌రు వార్త‌ల్లో ఉంటారు.
 
ఇప్పుడు అలా వార్త‌ల్లో బోయ‌పాటి శ్రీను ఉన్నారు. మొన్న మొన్న‌టి వ‌ర‌కు విన‌య విధేయ రామా, ఆ త‌ర్వాత ఆ చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య‌తో గొడ‌వ‌లు, మొన్న‌టికి మొన్న మైత్రీ మూవీస్ అత‌ని నుంచి తిరిగి తీసుకున్న అడ్వాన్స్ విశేషాలు. ఇలా ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో ఉన్న వ్య‌క్తి బోయ‌పాటి శ్రీను.
 
మీడియా ఆయ‌న్ని ఇన్ని విధాలుగా ప్ర‌పంచానికి చూపిస్తుంటే, ఆయ‌న మాత్రం ఇంకో ర‌కంగా బిజీగా ఉంటున్నారు. ఎవ‌రేమ‌నుకున్నా డోంట్ కేర్ అంటూ త‌న‌దైన శైలిలో సెట్లో విజృంభిస్తున్నారు. ఇంత‌కీ బోయ‌పాటి శ్రీను ఏ సెట్లో ఉన్నారు? ఇంకా బాల‌కృష్ణ సినిమా ప్రారంభం కాలేదు క‌దా?  పైపెచ్చు ఆ సినిమా స్క్రిప్ట్ ను కూడా లాక్ చేయ‌లేదు. ఈ ప‌రిస్థితుల్లో బోయ‌పాటి ఏం చేస్తున్నారు? అనేది అంద‌రి అనుమానం.
 
బోయ‌పాటి ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం యాడ్స్ షూట్ చేస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ప్ర‌చారానికి వాడుకోవ‌డానికి అనువుగా ఆయ‌న యాడ్స్ కాన్సెప్ట్ లు రెడీ చేస్తున్నారు.గ‌తంలో పుష్క‌రాల‌కు సంబంధించిన యాడ్‌లు కూడా బోయ‌పాటి చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇంత‌కు ముందు ఈ యాడ్‌ల వ్య‌వ‌హారాల‌న్నీ సీనియ‌ర్ డైర‌క్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు చూసేవారు. ఇప్పుడు మాత్రం అంతా బోయ‌పాటి చూస్తున్నారు. సో త‌న ప‌నుల్లో తాను బిజీ. మీడియా ఏం రాసినా డోంట్ కేర్ అన్న‌ది బోయ‌పాటి పాల‌సీ అన్న‌మాట‌.