‘సరిలేరు నీకెవ్వరు’ కి బండ్ల గణేష్ షాకింగ్ రెమ్యునేషన్

‘సరిలేరు నీకెవ్వరు’ కి బండ్ల గణేష్ షాకింగ్ రెమ్యునేషన్

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ద్వారా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటన చేసింది. ఈ సినిమాలో ఆయన కోసం దర్శకుడు ప్రత్యేకమైన పాత్రను రాసినట్లు తెలిసింది. కథను మలుపు తిప్పే రోల్ లో బండ్ల గణేష్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే దాదాపు సినిమాలకు దూరమయ్యాడని అందురూ అనుకుంటున్న టైమ్ లో బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇవ్వడంటో హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపధ్యంలో ఈ సినిమాకు బండ్ల గణేష్ రెమ్యునేషన్ ఎంత తీసుకోబోతున్నాడనేది చర్చనీయాంసంగా మారింది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రోజుకు ఐదు లక్షలు చొప్పున బండ్ల గణేష్ కు ఇవ్వనున్నారు. ఓ కమిడియన్ కు ఈ స్దాయి రెమ్యునేషన్ ఎక్కువే. కానీ బండ్ల గణేష్ కు ఉన్న క్రేజ్ కు ఇది తక్కువే అంటున్నారు.

“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. ఇక మరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం రాబోతుండడంతో ఆ రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది.