అల్లు అర్జున్ కు అనుకున్న కథతో అఖిల్ నెక్ట్స్ ఫిక్స్

సెన్సేషనల్ హిట్ కోసం తొలి నుంచి ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని చేసిన ‘మిస్టర్ మజ్ను’ కూడా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో అఖిల్ తన తరువాత సినిమా ఏ డైరక్టర్ తో చేయాలి…ఏ బ్యానర్ లో చేయాలనే విషయంలో కన్ఫూజ్ కాకుండా కసరత్తు చేసారు. చివరకు ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అఖిల్ తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్నారు. ఆ మేరకు కథ కూడా ఫైనల్ అయిందట. ఆ సినిమాను మనం ఇంతకు ముందు చెప్పుకున్నటట్లు గీతా ఆర్ట్స్ నే నిర్మించనుంది. ఇక ఈ చిత్రం కథను అల్లు అర్జున్ కోసం తయారైంది. అయితే అల్లు అర్జున్ కు ఇమేజ్ మారిన నేపధ్యంలో అలాంటి కథ వర్కవుట్ కాదని ఆపి, అఖిల్ తో పట్టాలు ఎక్కిస్తున్నారని సమాాచారం. 

మొదట అఖిల్ … దర్శకుడు పరశు రామ్ తో సినిమా చేయటానికి మొగ్గు చూపుతాడని వార్తలు వచ్చినా బొమ్మరిల్లు భాస్కర్ కథ నచ్చి ఓకే అన్నారట. నాగార్జున కూడా ఈ ప్రాజెక్టు పై మక్కువ చూపుతున్నారట. ఈ కథ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో చాలా కాలం క్రితమే తయారైందిట.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందిని త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ సైతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నేఫధ్యంలో ఖచ్చితంగా తనకు హిట్ ఇస్తాడని అఖిల్ నమ్ముతున్నాడు. ఈ భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ ట్రాక్ లో పడి భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.