మిస్టరీని చేధించే పనిలో రెజీనా

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా ఓ మిస్టరీని ఛేదించడాని సిద్ధమైంది.  మరి ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తెలియడానికి ఇంకా సమయం ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించారు రెజీనా.
 
మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం  జరిగింది. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించనున్నారు. తమిళనాడులో చిత్రీకరణ కూడా ప్రారంభించారు చిత్రబృందం. కన్నడ హీరోయిన్‌ అక్షర గౌడ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు.
 
ఈ సినిమాలో యాక్షన్‌ కూడా ఉండబోతోందట. రెజీనా డూప్‌ లేకుండా ఫైట్స్‌ చేయనున్నారని సమాచారం. ఇందుకోసం శిక్షణ కూడా ప్రారంభించారట. ఈ విషయం గురించి రెజీనా ను అడిగితే.. ఎస్ డూప్‌ లేకుండా ఫైట్స్‌ చేస్తాను. అందుకు నేను సిద్ధమయ్యకూడా అని చెప్పుకొచ్చింది!?