బన్ని ఇచ్చిన ట్విస్ట్ కు సుకుమార్ మైండ్ బ్లాక్ ట

కథ మార్చేయమన్న బన్ని, సుకుమార్ కు వేరే దారిది?

గత కొద్ది కాలంగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా గురించి రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. మహేష్ తో అనకున్న కథనే కొద్ది పాటి మార్పులతో అల్లు అర్జున్ తో చేయబోతున్నారని చెప్పుకున్నారు. ఎర్ర చందన స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ అని వినపడింది. అయితే ఇప్పుడు ఈ కథకు కొత్త ట్విస్ట్ వచ్చి పడింది.

రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన సుకుమార్ తను రీసెంట్ గా రాసిన స్మగ్లింగ్ కథ అప్ డేటెడ్ వెర్షన్ వినిపించారట. అయితే అది అల్లు అర్జున్ కు ఎక్కలేదట. రంగస్దలం లాంటి కథ ఏదన్నా తనతో చేయచ్చు కదా అని అడిగారట. అది కుదరకపోతే పోనీ ఆర్య లాంటి స్టోరీ అయినా చేద్దామని చెప్పాడట. తనకు ఆర్య 3 ని చేయటం ఇష్టం లేక లవ్ స్టోరీ జోలికి పోలేదని సుకుమార్ సమాధానమిచ్చారట. అయితే తన దగ్గర ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఐడియా ఉందని చెప్పారట. బన్ని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అది పూర్తి వెర్షన్ విందామని అన్నాడట.

అల్లు అర్జున్ ని కొత్తగా ప్రెజెంట్ చేసే ఆ కథ ఈ జనరేషన్ కు సంభందించిన ప్రేమ కథ అని , రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండేలా చేద్దామని సుకుమార్ చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మరి ఇప్పుడు లవ్ స్టోరీ చేస్తారా, లేక స్మగ్లింగ్ కథతోనే ముందుకు వెళ్తారో చూడాలి. ఏదైమైనా ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఇప్పటివరకూ చూపించని విధంగా సుకుమార్ చూపించాలని మాత్రం ఫిక్స్ అయ్యారట. దాంతో ఇప్పుడా స్క్రిప్టు రాసే పనిలో పడ్డారట సుకుమార్.

రష్మిక హీరోయిన్ గా నటించే ఈ చిత్రానికి ఎప్పటిలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. మైత్రీ మూవి మేకర్స్ వారు భారీగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రం తర్వాతే వేణు శ్రీరామ్ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు కూడా స్క్రిుప్టు వర్క్ దిల్ రాజు ఆఫీస్ లో జరుగుతోంది. ఐకాన్ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ విభిన్నమైన పాయింట్ తో తెరకెక్కనుంది.