బండ్లగణేష్ కి రెమ్యునేషన్ ట్విస్ట్ , బుర్ర తిరిగిపోయిందిట

బండ్లగణేష్ మాత్రం ఈ ట్విస్ట్ ని ఊహించలేదట

మహేష్‌బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో బండ్ల గణేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇఫ్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని కాశ్మీర్‌లో విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ లో షూట్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో చాలా కాలం తర్వాత ముఖానికి రంగు వేసుకున్న బండ్ల గణేష్ ఎంత రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నిర్మాతగా గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసిన బండ్ల గణేష్…కు నటుడుగా ఎంత ఇవ్వాలనేది పెద్ద క్వచ్చినే.

అలాగని ఓ కమిడియన్ గా ఎక్కువ రెమ్యునేషన్ ఇవ్వరు. ఈ నేపధ్యంలో బండ్ల గణేష్ కు రోజుకు ఐదు లక్షలు చొప్పున రెమ్యునేషన్ ఆఫర్ చేసారని తెలుస్తోంది. దాంతో ఫుల్ హ్యాపీగా ఒప్పుకున్న గణేష్ కు పడ్డ ట్విస్ట్ ఏమిటంటే…ఆయన పాత్రను కేవలం నాలుగు రోజుల్లో ఫినిష్ చేసి ఇరవై లక్షలు చేతిలో పెట్టారట. ఇది బండ్ల గణేష్ అసలు ఊహించలేదట. డేట్స్ అడిగారంటే మినిమం ఓ పది రోజులు అయినా ఉంటయనుకున్నారట.

ఇక ప్రస్తుతం జరుగుతు్న షెడ్యూల్ లో రవితేజ వెంకీ సినిమా తరహాలో ఓ ట్రెయిన్ ఎపిసోడ్ ఫన్నీగా నడవనుంది. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కాకుండా బండ్ల గణేష్ పై పూర్తి కామెడి చేయనున్నారు. ఈ చిత్రంలో బండ్ల గణేష్ పాత్ర పేరు బ్లేడ్ గణేష్ అని వినిపిస్తోంది. బండ్ల గణేష్ పాత్ర ఓ కోటిశ్వరుడు కొడుకు క్యారక్టర్ అని, అతనికి విపరీతమైన డబ్బు ఉన్నా..బుర్ర మాత్రం ఉండదని..ఆ పాత్రలో గణేష్ చేసే చేష్టలు తెగ నవ్విస్తాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో సీనియర్‌ నటి విజయశాంతి మరో కీలక పాత్రలో నటించనున్నారు. రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్‌బాబు నటిస్తున్నారీ సినిమాలో.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.