రూ.426 కోట్ల లోన్ ఎగవేత.. సుజనా చౌదరి ఆస్తులు జప్తు!

ఇప్పుడు కోటీశ్వరులుగా ఉన్న చాలా మంది ఎదుగుదలలో బ్యాంక్ రుణాల ఎగవేత కూడా ఒక సక్సెస్ మంత్ర అని అంటుంటారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత… బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన వారి సంఖ్య బాగా పెరిగిపోతుందని అంటున్నారు. ఇదే సమయంలో… ఎంత అవినీతిపరుడైనా బీజేపీ కండువా కప్పేసుకుంటే… వాషింగ్ పౌడర్ నిర్మా టైంపులో పవిత్రంగా అయిపోతారాని బీఆరెస్స్ నేతలు ఏకంగా క్యాంపైనే రన్ చేశారు. ఆ సంగతి అలా ఉంటే… సుజనా చౌదరి వ్యవహారం ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది.

రుణాల ఎగవేతలో తన రికార్డులను తానే బ్రేక్ చేయాలనుకున్నారో.. లేక, ఇది కూడా ఎదుగుదలలో ఒక భాగం అని భావించారో.. అదీగాక రుణం చెల్లించేటంత సొమ్ము లేదో తెలియదు కానీ… మాజీ టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు సుజనా చౌదరి ఆస్తులను బ్యాంకు జప్తూ చేసింది! ఈ మేరకు పత్రికా ప్రకటన ఇచ్చిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. నోటీసులకు స్పందించనందుకే బ్యాంక్ ప్రకటన ఇవ్వాల్సి వచిందని అధికారులు చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన యలమంచిలి సత్యానాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి మొదట్లో టీడీపీ నేతగా బాగా ఫేమస్ అయ్యారు. కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ సమయంలో సుజనా గ్రూప్ పేరుతో వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కుచ్చు టోపీ వేశారనే వార్తలొచ్చాయి. డొల్ల కంపెనీల సహాయంతో బ్యాంకులకు సుమారు రూ.5,700 కోట్ల మేర సుజనా చౌదరి మోసగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.

ఇలా సాగుతున్న సుజనా ఆర్థిక వ్యవహారాలపై 2018లో ఈడీతో పాటు సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. దీంతో… 2019లో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఏమి జరిగిందనేది తెలిసిన విషయమే. మళ్లీ ఆ కేసుల టాపిక్కే రాలేదని విపక్షాలు విమర్సలు చేస్తుంటాయి. ఈ సమయంలో బీఆరెస్స్ నేతలు “వాషింగ్ పౌడర్ నిర్మా” క్యాంపైన్ ను తెరపైకి తెచ్చారు.

ఈ క్రమంలో తాజాగా సుజనా చౌదరి యూకో బ్యాంకుకు చెల్లించాల్సిన రూ.426,55,69,662 ను ఎగవేశారు! మేడ్చెల్ జిల్లా పరిధిలో ఉన్న భూములను తాకట్టు పెట్టి చాలా ఏళ్ల క్రితమే సుజనా చౌదరి రూ.420 కోట్ల వరకు రుణం తీసుకున్నారు. మేడ్చెల్ జిల్లాలో ఇండస్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఇండస్ క్రియేటర్స్ కు చెందిన భూములను యూకో బ్యాంకులో సుజన మెటల్ ప్రొడక్ట్స్, వై సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) రుణం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే… పలుమార్లు ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు పంపినా సుజనా చౌదరి స్పందించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. ఇలా నోటీసులు పంపినా అవి డెలివరీ కాకుండా తిరిగి వస్తుండటంతో.. పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇస్తున్నట్లు పేర్కొన్నారు బ్యాంక్ అధికారులు. దీంతో సుజనా చౌదరికి ఇచ్చిన రుణాన్ని నిరర్దక ఆస్తి కింద జమకట్టి.. అతను తాకట్టు పెట్టిన భూములను బ్యాంకు జప్తు చేసుకున్నది.

ఈ మేరకు బ్యాంకు పలు పత్రికల్లో నోటీసులు కూడా జారీ చేసింది. ఈ ఏడాది జూలై 31 నాటికి అసలు, వడ్డీ కలుపుకొని సుజనా చౌదరి రూ.426,55,69,662 చెల్లించాల్సి ఉందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం ప్రకటన జారీ చేసిన 60 రోజుల్లోగా చెల్లించడంలో విఫలమయ్యారని బ్యాంకు తెలిపింది. దీంతో ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపింది!