Nimmala Rama Naidu: ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్: రెండేళ్లలో కీలక ప్రాజెక్టుల పూర్తి!

Nimmala Rama Naidu: ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రెండేళ్లలో రూ. 2,000 కోట్లతో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

మంగళవారం అమరావతిలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఈ 11 ప్రాజెక్టులు పూర్తి కావడం ద్వారా ఉత్తరాంధ్రలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందుతుంది. మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి లభ్యత స్థిరపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించే ప్రాజెక్టులు, ముఖ్యంగా కరువు ప్రాంతాలకు మేలు చేసే పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.

నేరడి బ్యారేజ్ నిర్మాణానికి లైన్ క్లియర్: వంశధార ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో చేర్చడంలో సీఎం చంద్రబాబు చేసిన కృషిని మంత్రి కొనియాడారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయని, త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వంపై విమర్శలు: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారని మంత్రి మండిపడ్డారు. ఆ కాలంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఫలితంగా ప్రాజెక్టులు కుంటుపడ్డాయని విమర్శించారు.

ఈ సమీక్షా సమావేశంలో నీటి పారుదల సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ఉన్నతాధికారులు మరియు ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Twist in Ashu Reddy Case :Dasari Vignan | Telugu Rajyam