Gottipati Ravi Kumar: లోకేశ్ నాయకత్వం పార్టీకి శ్రీరామరక్ష: మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసలు

Gottipati Ravi Kumar: తెలుగుదేశం పార్టీ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీ ఉన్న సమయంలో నారా లోకేశ్ చూపిన ధైర్యం, నాయకత్వ పటిమ అమోఘమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, లోకేశ్ సమన్వయకర్తగా, నాయకుడిగా పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.

యువగళం పాదయాత్ర – రాష్ట్రం కోసం ముందడుగు వేసారు. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఎన్ని అడ్డంకులను లెక్కచేయకుండా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పిందని మంత్రి గొట్టిపాటి అన్నారు. “రాష్ట్ర బాగు కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ యువతలో భరోసా నింపారు మనిషి నారా లోకేశ్ గారు ,” అని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

టీడీపీని ఒక ప్రాంతీయ పార్టీగా అత్యంత సమర్థవంతంగా నడిపిస్తున్న క్రెడిట్ లోకేశ్‌కే దక్కుతుందని మంత్రి రవికుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక అంశాలను నారా లోకేష్ గురించి ప్రస్తావించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు వంటి భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో లోకేశ్ కోఆర్డినేషన్ కీలకం. మరియు పార్టీ కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడం, వారి సంక్షేమ నిధికి శ్రీకారం చుట్టడం వంటి నిర్ణయాలు కార్యకర్తల్లో ఎంతో ధైర్యాన్ని నింపాయి. కోటి మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కృషి మరువలేనిది.

“కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇస్తూ, అహర్నిశలు ప్రజల బాగు కోసం పరితపించే గొప్ప వ్యక్తిత్వం మా లోకేశ్‌ది.” అని  మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

మంత్రిగా అభివృద్ధి పథంలో.. రాష్ట్రాన్ని ఇంటూ ముందుకు తెసుకొని పోవటం లో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారని గొట్టిపాటి తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని, విద్యా విధానంలో లోకేశ్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Singer Mangli Case: Some Shocking Update From Police investigation | Telugu Rajyam