భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దులో మళ్లీ పెరిగిన ఉద్రిక్తత క్రీడా ప్రపంచాన్ని కుదిపేసింది. ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే జమ్ము ప్రాంతం నుంచి పాకిస్థాన్ దాడుల సమాచారం రావడంతో భద్రతా సంభారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దులో మళ్లీ పెరిగిన ఉద్రిక్తత క్రీడా ప్రపంచాన్ని కుదిపేసింది. స్థలు అప్రమత్తమయ్యాయి. భద్రత క్షీణిస్తుందన్న సంకేతాలతో మ్యాచ్ను తక్షణమే రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
“Very very scary” – Cheer leader’s SHOCKING video from Punjab Kings Vs Delhi Capitals IPL match in Dharamshala. pic.twitter.com/S830aDKer3
— Manobala Vijayabalan (@ManobalaV) May 8, 2025
స్టేడియంలోని అన్ని లైట్లు ఆపివేసి, అత్యవసర పరిస్థితిని అమలు చేశారు. ప్రేక్షకులను బహిర్గతం చేయడం కోసం భద్రతా సిబ్బంది హుటాహుటిన కదిలారు. ఆటగాళ్లు, సిబ్బంది కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ వేళ స్టేడియంలో ఉన్న ఓ చీర్ గర్ల్ తన మొబైల్లో వీడియో తీసి, “ఇక్కడ చాలా భయం వేస్తోంది, ఏ లైట్ లేదు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఉంది” అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది.
ఈ పరిణామాలపై బీసీసీఐ స్పందిస్తూ, “మాకు ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతే ప్రథమం” అని స్పష్టం చేసింది. పరిస్థితులు సమీక్షించి ప్రభుత్వం, భద్రతా విభాగాల సూచనల మేరకు తదుపరి మ్యాచ్ల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అభిమానులకు వచ్చే సమాచారాన్ని అధికారికంగా మాత్రమే విశ్వసించమని బీసీసీఐ సూచించింది. ఇక ఈ సడన్ షాక్తో ఐపీఎల్ అభిమానులు విస్మయానికి గురయ్యారు. మ్యాచ్ రద్దు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎంత ఉద్రిక్తత ఉందో తేటతెల్లం చేస్తోంది. రాబోయే రోజుల్లో సరిహద్దు పరిస్థితులు కాస్త శాంతిస్తే, తిరిగి మ్యాచ్లు నిర్వహించాలన్నది ఐపీఎల్ నిర్వాహకుల అభిప్రాయం.