Chandrababu Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన 76వ జన్మదినాన్ని అత్యంత నిరాడంబరంగా, సామాన్య ప్రజల మధ్య జరుపుకున్నారు. ఆడంబరాలకు దూరంగా, పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటీన్’లో తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు.
సోమవారం అనగా ఈ రోజు ఉదయం విజయవాడలోని పటమట ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అర్ధాంగి నారా భువనేశ్వరి గారి తో కలిసి విచ్చేశారు, అన్న క్యాంటీన్లో సందడి.. ప్రజలతో కలిసి అల్పాహారం.
క్యాంటీన్కు చేరుకున్న సీఎం దంపతులు అక్కడ ఉన్న లబ్ధిదారులు, కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారికి ఆహారాన్ని వడ్డించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో పాటే కూర్చుని అల్పాహారం చేశారు ముఖ్యమంత్రి గారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం భువనేశ్వరి గారు భారీ విరాళం ఇచారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి గారు ప్రకటించిన విరాళం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రూ. 76 లక్షల విరాళం: చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణ ఖర్చు నిమిత్తం ఆమె రూ. 76 లక్షలను విరాళంగా ఇచ్చారు. సాధారణంగా రోజుకు రూ. 5లకే భోజనం అందించే అన్న క్యాంటీన్లలో, భువనేశ్వరి గారి విరాళం కారణంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ‘అందరివాడు చంద్రబాబు’ ట్రెండింగ్
ముఖ్యమంత్రి నిరాడంబరతను చూసి టీడీపీ శ్రేణులు, అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. “అందరివాడు మన చంద్రబాబు” అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. భారీ కేకులు, వేడుకలు కాకుండా ప్రజల ఆకలి తీర్చే చోట ముఖ్యమంత్రి తన పుట్టినరోజును గడపడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

