న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మందుబాబుల హల్చల్.. ప్రాణాలు కోల్పోయిన యువతి..?

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా మద్యం సేవించడానికి అలవాటు పడుతున్నారు. ఇలా చిన్న వయసులోనే మద్యం తాగటానికి అలవాటు పడి దానికి బానిసలుగా మారుతున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో యువత పబ్బులు డిస్కోలు అంటూ మందు తాగి రోడ్లమీద వీరంగం చేశారు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మందుబాబులు చేసిన పనికి ఒక యువతి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… ఆదివారం తెల్లవారుజామున కొందరు యువకులు మద్యం మత్తులో కారు నడుపుతుండగా ..అదే దారిలో స్కూటీ మీద వెళుతున్న ఒక యువతిని ఢీకొట్టారు. అయినా కూడా కారు ఆపకుండా అక్కడి నుండి వేగంగా వెళ్లారు. అయితే కారు స్కూటీని ఢీ కొట్టిన సమయంలో యువతి కారు కింద పడి ఆమె వేసుకున్న డ్రెస్ కారు టైలర్ లో విరుక్కోవటం వల్ల దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర కారు ఆ యువతీని రోడ్డుమీద ఇచ్చుకు వెళ్ళింది. ఇలా కారు వేగంగా యువతని ఈడ్చుకొని వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే రోడ్డుమీద ఎవరు తీసేరీరం ఈడ్చుకొని వెళ్లడం వల్ల ఆమె శరీరం మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఉంది.

ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అటుగా వెళుతున్న స్థానికులు యువతీ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. యువతీ మృతదేహం పై దుస్తుల లేకపోవడంతో అత్యాచారం చేసి ఆమెను హత్య చేసినట్లు మొదట అందరూ భావించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ప్రాంతాన్ని పరిశీలించగా రోడ్డుమీద యువతిని కారు ఈడ్చుకొని రావటం వల్లే ఆమె మరణించింది అని నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు కారణమైన వారి మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.