అమ్మాయి మోజులో పడి స్నేహితుడిని హత్య చేసి జైలు పాలైన యువకుడు..?

ప్రస్తుత కాలంలో ఎదుటి యువకులు అతి చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోతున్నారు. కొంతమంది అబ్బాయిల చేతుల్లో దారుణంగా మోసపోతుంటే మరి కొంత మంది అమ్మాయిలు అబ్బాయిలను దారుణంగా మోసం చేస్తున్నారు. ఇద్దరు యువకులు పోట్లాడిన ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఒక యువతి కోసం ఇద్దరు యువకులు పోటీపడి హత్య చేసిన ఘటన హైదరాబాదులో కలకలం రేపుతుంది. ఇద్దరు ఒక స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. దీంతో యువకుడు తన స్నేహితుడిని అదే దారుణంగా హత్య చేసి చంపాడు.

వివరాలలోకి వెళితే… హైదరాబాద్ కి చెందిన నవీన్, హరిహర, యువతి ముగ్గురూ దిల్‎సుఖ్‎నగర్‎లోని ఐడియల్ కాలేజీలో ఇంటర్ చదివారు. ప్రస్తుతం నవీన్ నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతుండగా.. హరిహర అరోరా కాలేజీలో చదువుతున్నాడు. ఇదిలా ఉండగా మొదటి నుంచి యువతి నవీన్ తి కాస్త చనువుగాఉండేది. ఈ క్రమంలో హరిహర కూడా యువతిపై మనసుపడ్డాడు. దీంతో నవీన్ అడ్డుతొలగించుకోవాలని భావించి.. పార్టీ చేసుకుందామంటూ హరిహర, నవీన్‎ను హైదరాబాద్ కు రప్పించాడు. అబ్దుల్లాపూర్ మెట్‎ పరిధిలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ వద్ద పార్టీ చేసుకున్నారు.

ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న నవీన్ ను హరిహర దారుణంగా హత్య చేశాడు. అనంతరం నవీన్ హత్య విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. మెసేజ్‎లో కూడా నవీన్ హత్య గురించి చాట్ చేశాడు. చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ‘ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలు కోసి ఫోటో తీసి అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. ఇదిగో పెదాలు అంటూ పెదాలు కోసి ఫోటో పంపించాడు. ఈ గుండె కదా నిన్ను తాకింది.. ఇదిగో గుండె అంటూ శరీరాన్ని ముక్కలు చేసి గుండెను ఫోటో పంపించాడు. ఆ తరువాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోశాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా విసిరేశాడు. ఇలా క్రూరంగా హత్య చేసిన హరి హర ని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఒక యువతి కోసం ఇద్దరు యువకులు జీవితం
బలైపోయింది.