సికింద్రాబాద్‌లో దారుణం

సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. ప్రేమించాలంటూ కొంతమంది పోకిరీలు అమ్మాయి వెంట పడి వేధించడంతో వారి వేధింపులకు తాళలేక తానే తనువు చాలించింది. 8 మంది పోకిరీలు అమ్మాయి వెంట పడ్డట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటంటే…

సికింద్రాబాద్ తిరుమలగిరి పరిధిలోని సాయిబాబా బస్తీకి చెందిన శ్రావణి అనే యువతి ఇంటర్ చదువుతోంది. కొంత మంది పోరగాళ్లు అమ్మాయి వెంటపడి ప్రేమించాలని వేధించారు. ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపుతామని బెదిరించారు. గతంలోనే తల్లిదండ్రులు పెద్ద మనుషులతో మాట్లాడి పోకిరిగాళ్లను హెచ్చరించారు. అయినా కూడా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.

శ్రావణి 

 ఈ మధ్య కాలంలో బెదిరింపులతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో శ్రావణి ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాలనీకి చెందిన పలువురి వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మౌనిక తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 40 మంది కాలనీ వాసులు సంతకాలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.