రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ యువతి మృతి (వీడియో)

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రమ్య, ప్రవీణ్ కుమార్ దంపతులు. వీరు సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. శనివారం సెలవు కావడంతో చిలుకూరి బాలాజీ దర్శనానికి వారు బయలు దేరారు.

గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో లారీని ఓవర్ టేక్ చేస్తుండగా బైక్ అదుపుతప్పి లారీ కిందకు వెళ్లింది. దీంతో రమ్య లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే చనిపోగా ప్రవీణ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రవీణ్ కుమార్ ను ఆస్పత్రికి తరలించారు.  రమ్య క్యాప్ జెమిని కంపెనీలో పనిచేస్తుంది. రమ్య మృతితో తోటి ఉద్యోగులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.   

 

gachibowli accident

 

 

 

తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ్

ఈరోజు సెలవు కావడంతో భార్యాభర్తలిద్దరూ చిలుకూరు దేవస్థానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సిగ్నల్ దగ్గర బైకు అదుపు తప్పి కిందపడింది. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారి మీద ఎక్కడంతో చక్రాల కింద రమ్య చితికిపోయింది. ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ వెళ్తున్న గమ్యాన్ని చూసుకోకుండా ఎడమ వైపు నుంచి ముందుకు వెళ్లే క్రమంలో ఒక్కసారిగా లారీ ఎడమ వైపు రావటంతో ఈ ప్రమాదం జరిగినట్లు గచ్చిబౌలి ఎస్సై తెలిపారు.

ఇటీవల ఇద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఉప్పల్‌లో బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో వెనుక నుంచి కారు ఎక్కడంతో అక్కడికక్కడే యువతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.