కూకట్ పల్లిలో 27 మంది మహిళల అరెస్టు

కూకట్ పల్లిలో 27 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. బస్టాప్ ల వద్ద మరియు సిగ్నల్ ల వద్ద ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వ్యభిచారానికి ప్రేరేపిస్తూ ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట భాగ్యనగర్ కాలనీ వద్ద మహిళలు న్యూసెన్స్ చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీంతో శనివారం రాత్రి ప్రత్యేక బృందాలతో వారు అక్కడ నిఘా వేశారు. ఆ సమయంలో న్యూసెన్స్ చేస్తూ వ్యభిచారానికి ప్రేరేపిస్తున్న 27 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు గంటల పాటు తనిఖీలు చేసి వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.  ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు.