రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల మృతి

హైదరాబాద్ లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు.

నానక్ రామ్ గూడలోని ఐసిఐసిఐ బ్యాంకులో దీపికా నిఖిల్, సయ్యద్ అహ్మద్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లేందుకు  ఇద్దరూ ఒకే స్కూటి పై బయలుదేరారు. లంగర్ హౌస్ పరిధిలోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే వద్దకు చేరుకోగానే టిప్పర్ వీరు ప్రయాణిస్తున్న స్కూటిని ఢీ కొట్టింది. దీంతో వారిద్దరు కూడా ఎగిరి కింద పడ్డారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ఉదయాన్నే ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్ కంట్రోల్ చేసి వారి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలసుకున్న తోటి ఉద్యోగులు అక్కడకు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు.