నడి రోడ్డులో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి.. సజీవ దహనం

హైదరాబాద్ నగరంలో పట్టపగలు దారుణం జరిగింది. పట్టపగలు నడి రోడ్డు పై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుని ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ దారుణం సనత్ నగర్ లో జరిగింది.

సనత్ నగర్ లో వెంకటేష్ అనే వ్యక్తి కిరాణ షాపు పెట్టుకొని నివసిస్తున్నాడు. ఇతనికి భార్య పిల్లలున్నారు. గత కొంత కాలంగా వెంకటేష్ ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. శుక్రవారం షాపుకు వచ్చిన వెంకటేష్ రోడ్డు మీదకు చేరుకొని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

అతనిని ఎవరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేయలేదు. షాపులో ఉండి గమనించిన వెంకటేష్ భార్య ఆర్పే ప్రయత్నం చేసేలోగా అతను అక్కడే సజీవ దహనమయ్యాడు. వెంకటేష్ మృతితో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.