తాగొచ్చి భర్త హింసిస్తున్నాడని విసుగు చెందిన భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంట్లో ఉండి ఇంటి పనులు చక్కబెట్టుకుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పనులను పంచుకుంటూ బయట ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే భర్త చేస్తున్న ఉద్యోగం కోసం ఆశపడిన ఒక మహిళ ఏకంగా తన భర్తను హత్య చేసిన ఘటన ఇటీవల సంచలనం రేపింది. బట్టలు హత్య చేసి తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ దారుణ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…భద్రాద్రి కొత్తగూడెంలోని గాంధీ కాలనీలో కొమ్మర బోయిన శ్రీనివాస్ (50), భార్య సీతామహాలక్ష్మి (43)దంపతులు కలిసి జీవనం సాగిస్తున్నారు . వీరికి సాయి కుమార్ అనే కొడుకు కూడా ఉన్నాడు. శ్రీనివాస్ కొత్తగూడెం కలెక్టరేట్ లో అటెండర్ గా శ్రీనివాస్ పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే డిసెంబర్ 30వ తేదీ ఉదయం తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాస్ ను సీతా మహాలక్ష్మి కొత్తగూడెంలోని జిల్లా ఆస్పత్రిలో జాయిన్ చేసింది. డిసెంబర్ 29న అర్థరాత్రి శ్రీనివాస్ వంటింట్లో కాలు జారిపడ్డాడని..దీంతో తలకు తీవ్ర గాయమైంది అని చెప్పి అందరినీ నమ్మించింది. వైద్యులు వెంటనే అతనికి చికిత్స అందించారు. అయితే, శ్రీనివాస్ చికిత్స పొందుతూ రెండు, మూడు గంటల్లోనే మరణించాడు.

అయితే తన తండ్రి మృతి పట్ల సాయికుమార్ కి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా శ్రీనివాస్ మరణించిన రోజు నుండి సీతామహాలక్ష్మి కూడా కనిపించకపోవడంతో సాయికుమార్ కి అనుమానం పెరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీతామహాలక్ష్మి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకోగా.. అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ఆమెను విచారించగా అసలు విషయం బయట పెట్టింది. శ్రీనివాస్ రోజు తాగొచ్చి తనని ఇబ్బంది పెడుతున్నాడని అందుకే డిసెంబర్ 29వ తేదీ అతను నిద్రపోయిన తర్వాత తలపై కర్రతో గట్టిగా కొట్టడంతో మరణించాడని నేరం అంగీకరించింది.