రెండేళ్ల చిన్నారి పై అత్యాచారం చేసిన 40 ఏండ్ల వ్యక్తి

రోజు రోజుకు సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతినడంతోపాటు మరికొంత మంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన 40 ఏండ్ల వ్యక్తి రెండేళ్ల చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైసర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏండ్ల వయస్సున్నవ్యక్తి గురువారం రాత్రి 9 గంటల సమయంలో పాపను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప గట్టిగా ఏడుస్తుండడంతో స్థానికులు అక్కడకు వెళ్లారు. దీంతో ఆ దుండగుడు పాపను వదిలేసి వెళ్లి పోయాడు. స్థానికులు విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులకు చెప్పారు.

వారు వెంటనే పాపను ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ టివిలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బాలికకు సరైన వైద్యం అందడం లేదని చిన్నారి బంధువులు గాంధీ ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని వారు డిమాండ్ చేశారు.