భూ వివాదం వల్ల భార్యతో కలసి తోడపుట్టిన తమ్ముడిని హతమార్చిన అన్న!

ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమాభిమానాలు కరువైపోయాయి. ఈ కాలంలో డబ్బుకు ఉన్న విలువ బంధాలకు, బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. డబ్బు కోసం తొడబుట్టిన వారు, కన్న తల్లిదండ్రులని చూడకుండా వారిని హతమార్చేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తోడబుట్టిన అన్నదమ్ముల వద్ద ఉన్న భూవివాదం వల్ల తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. తోడబుట్టిన తమ్ముడు అన్న కనికరం లేకుండా తన భార్యతో కలిసి అన్న తమ్ముడి ప్రాణాలు తీశాడు.

వివరాలలోకి వెళితే… సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన కొప్పెర భద్రయ్య, వీరబాబు అన్నదమ్ములు. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య భూ వివాదం నడుస్తోంది. తమ తాతల కాలం నుండి వారసత్వంగా వస్తున్న భూమిని కొన్ని సంవత్సరాల క్రితం భద్రయ్య వీరబాబు విక్రయించాడు. ఆ సమయంలో వీరబాబు మొత్తం డబ్బులు చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇటీవల భూమి ధర పెరగటంతో భూమి కోసం అదనపు డబ్బులు చెల్లించాలని భద్రయ్య వీరయ్యని కోరాడు. అయితే ఒప్పందం ప్రకారం పూర్తి నగదు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇప్పుడు అదనంగా డబ్బు ఇచ్చే ప్రసక్తి లేదని వీరబాబు చెప్పాడు.

దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి కొంతవరకు అదనపు డబ్బులు చెల్లించాలని వీరబాబుకి చెప్పారు. వీరబాబు కూడా దీనికి అంగీకరించాడు. ఈ క్రమంలో ఇటీవల వీరబాబు పొలానికి వెళ్లి పనులు చేస్తుండగా వీరయ్య అతని భార్య వెళ్లి వీరబాబుని అడ్డుకొని డబ్బులు చెల్లించిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని గొడవపడ్డారు. ఈ క్రమంలో వారి వెంట తెచ్చుకున్న కారంపొడి వీరబాబు కళ్ళల్లో చెల్లి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వీరబాబు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన గుర్తించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని వీరబాబు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. వీరయ్య అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.