హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆఫ్రీకన్ దేశానికి చెందిన మహిళ విద్యార్ధులు, ఒంటరి మహిళలే టార్గెట్ గా ఈ దందా నడుస్తోంది. ఆఫ్రీకన్ దేశానికి చెందిన జెనీవే ఆల్డో గోవా  కేంద్రంగా ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

సోమాజీగూడలో ఆటోలో 50 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్సటేషియాను ఎక్పైజ్ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విలువ 5 లక్షలు ఉంటుంది. ముందుగా అర్డర్ ఇచ్చిన వారికి ఈ మహిళ ప్లాన్ ప్రకారం వచ్చి సరఫరా చేసి వెళ్లి పోతుంది. మళ్లీ ఓ నెల రోజుల తర్వాత మళ్లీ ఆర్డర్లకు సరఫరా చేసి వెళ్లిపోతుంది. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి డగ్ర్ కలకలం రేపుతోంది.