ఔటర్ రింగ్ రోడ్డు పై కారు దగ్ధం, ఇద్దరు సజీవ దహనం

రంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు పై కారు దగ్దమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమవ్వగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. మేడ్చల్ నుంచి పటాన్ చెర్వుకు కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారులో మంటలు వచ్చాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు మియాపూర్ కు చెందిన శ్రీదేవి అనే మహిళ పై రిజిస్టర్ అయ్యి ఉంది.