నేటి మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

మార్కెట్ లో రోజు రోజుకు బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు పెరుగుతుండడంతో కొనుగోలు దారులు ఆందోళనలో ఉన్నారు. భారత మార్కెట్  పైన చైనా, అమెరికా ప్రభావం పడడంతో మర్కెట్ లో బంగారం రేటు అమాంతం పెరిగిపోతుంది. బుధవారం మార్కెట్ లో

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,360, విజయవాడలో రూ.33,100, విశాఖపట్నంలో రూ.33,460, ప్రొద్దుటూరులో రూ.33,000, చెన్నైలో రూ.32,430గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,890, విజయవాడలో రూ.30,700, విశాఖపట్నంలో రూ.30,780, ప్రొద్దుటూరులో రూ.30,520, చెన్నైలో రూ.30,960గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,800, విజయవాడలో రూ.40,000, విశాఖపట్నంలో రూ.39,900, ప్రొద్దుటూరులో రూ.39,800, చెన్నైలో రూ.42,200 వద్ద ముగిసింది.