‘పేట్ట’ తెలుగు రైట్స్ ఆ నిర్మాతకే

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకి కేవలం తమిళంలోనే కాదు..తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. రీసెంట్ గా రజనీకాంత్-శంకర్ కలయికలో రూపొంది రిలీజైన 2.0. చిత్రం సైతం తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజై మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సెట్ పై ఉండగానే రజనీ మరో చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. వినూత్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సన్ పిక్చర్స్ పతాకంపై అత్యంత భారీ స్థాయిలో తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పేట్ట అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రజనీ నటిస్తున్న 165వ చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు పోస్టర్ ని విడుదల చేసారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఫ్యాన్సీ రేటు పెట్టి సంపాదించారు. త్వరలోనే తెలుగు ప్రమోషన్స్ సైతం ప్రారంభం చేయటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా రజనీ నటించిన చిత్రాలకు పూర్తి భిన్నమైన లుక్‌లో యంగ్‌గా కనిపిస్తున్నారాయన. రజనీ మార్కు మాస్ అంశాలతో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది. రజనీకాంత్‌ను కొత్త పంథాలో ఆవిష్కరించనున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. త్రిష, సిమ్రాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించగా అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.